ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తోతాపురి టన్నుకు రూ.20వేలు ఇవ్వాలి

ABN, First Publish Date - 2021-06-20T06:23:50+05:30

తోతాపురి టన్నుకు రూ.20వేల గిట్టుబాటు ధర కల్పించాలని శాంతియుత ఉద్యమ నేత ఈదల వెంకటాచలం నాయుడు డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ వద్ద దీక్ష చేస్తున్న వెంకటాచలం నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌ ఎదుట వెంకటాచలం నాయుడు రిలే దీక్ష 


చిత్తూరు, జూన్‌ 19: తోతాపురి టన్నుకు రూ.20వేల గిట్టుబాటు ధర కల్పించాలని శాంతియుత ఉద్యమ నేత ఈదల వెంకటాచలం నాయుడు డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటాచలం నాయుడు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక అన్నదాతల బాధలను పట్టించుకోండంలేదని విమర్శించారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించేందుకు రైతులు, గుజ్జు పరిశ్రమల యజమానులతో కలెక్టర్‌ నాలుగు దఫాలుగా సమీక్షలు నిర్వహించినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే వైసీసీ నేతలు మామిడి రైతులకు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయకపోతే సోమవారం నుంచి కలెక్టరేట్‌ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని వెంకటాచలం నాయుడు హెచ్చరించారు.

Updated Date - 2021-06-20T06:23:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising