నేడు ఎస్వీ వేదవర్సిటీ స్నాతకోత్సవం
ABN, First Publish Date - 2021-10-28T06:41:10+05:30
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలం ఆరో స్నాతకోత్సవం గురువారం ఉదయం 11.30గంటలకు ఆవర్సిటీ ప్రాంగణంలోని యాగశాలలో జరగనుంది.
తిరుపతి(విద్య), అక్టోబరు 27: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలం ఆరో స్నాతకోత్సవం గురువారం ఉదయం 11.30గంటలకు ఆవర్సిటీ ప్రాంగణంలోని యాగశాలలో జరగనుంది. వర్సిటీ ఛాన్సలర్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్లో అధ్యక్షోపన్యాసం చేస్తారని టీటీడీ అధికారులు ప్రకటించారు. 2019-20లో ఉత్తీర్ణులైన 120మందికి యూజీ డిగ్రీలు, 46మందికి పీజీ డిగ్రీలు, ఇద్దరికి ఎంఫిల్, 11మందికి పీహెచ్డీలు ప్రదానం చేయనున్నారు. తిరుపతికిచెందిన వేదపండితుడు బ్రహ్మశ్రీ గణేశన్శ్రౌతికి మహామహోపాధ్యాయ పురస్కారం అందజేస్తారు. వేద వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సన్నిధానం సుదర్శనశర్మ స్వాగతోపన్యాసం చేస్తారు.
Updated Date - 2021-10-28T06:41:10+05:30 IST