నేడు విద్యా సంస్థలకు సెలవు
ABN, First Publish Date - 2021-08-02T05:11:01+05:30
ఆడికృత్తిక సందర్భంగా జిల్లాలోని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో పురుషోత్తం తెలిపారు.
చిత్తూరు(సెంట్రల్), ఆగస్టు 1: ఆడికృత్తిక సందర్భంగా జిల్లాలోని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో పురుషోత్తం తెలిపారు. లోకల్ హాలిడేలో భాగంగా ఆడికత్తిక రోజును సెలవు దినంగా ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో కలెక్టర్ అనుమతితో సోమవారం సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు డీఈవో పేర్కొన్నారు.
Updated Date - 2021-08-02T05:11:01+05:30 IST