నైరోబీలో తిరుపతి యువకుడి మృతి
ABN, First Publish Date - 2021-10-22T06:05:14+05:30
తిరుపతికి చెందిన తిప్పలోళ్ల రవి (34) ఇటీవల నైరోబీలో మృతిచెందారు.
మృతదేహంకోసం క్లెయిమ్ చేసుకోవాలని అధికారుల విజ్ఞప్తి
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 21: తిరుపతికి చెందిన తిప్పలోళ్ల రవి (34) ఇటీవల నైరోబీలో మృతిచెందారు. ఆయన మృతదేహం కోసం ఇప్పటివరకు ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, మరెవరన్నా సన్నిహితులు రవి మృతదేహం కోసం క్లెయిమ్ చేసుకోవాలని నైరోబీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రవి పాస్పోర్ట్ (నెంబరు పి8315437)లోని వివరాల ప్రకారం.. ఆయన భార్య పేరు సనీత, తండ్రి శ్రీనివాసులు, పుట్టిన స్థలం బాదూరు, పుట్టిన తేదీ 8 సెప్టెంబరు 1987, ఆంధ్రప్రదేశ్.. అని ఉంది. 7-11-4/2, శ్రీనగర్ కాలనీ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్- 517501 చిరునామాతో పాస్పోర్ట్ ఉంది. ఇతడికి సంబంధించిన వ్యక్తులు 90285 69329 నెంబరులో సుబుకెరినీ.. +247540050001 నెంబరులో సుభా్షను, +254789144360 నెంబరులో రఘుపతిని సంప్రదించాలని సూచించారు. అలాగే నైరోబీ ప్రభుత్వ ఇ మెయిల్ cons.nairobi@mea.gov.in అడ్ర్సలో సంప్రదించాలని సూచించారు.
Updated Date - 2021-10-22T06:05:14+05:30 IST