తిరుపతిలో టీడీపీ నేతల వినూత్న నిరసన
ABN, First Publish Date - 2021-11-09T16:50:20+05:30
నగరంలో టీడీపీ నేతలు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు.
తిరుపతి: నగరంలో టీడీపీ నేతలు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న పెట్రోల్, డీజిల్ పంపుకు పూలమాల వేసి టెంకాయ కొట్టారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనలో పెద్దసంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Updated Date - 2021-11-09T16:50:20+05:30 IST