కోవ్యాక్సిన్ రెండవ డోసు అందరికీ వేస్తాం: గిరిష
ABN, First Publish Date - 2021-05-17T17:41:58+05:30
కోవ్యాక్సిన్ రెండు డోసును అందరికీ వేస్తామని, నగరవాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నగరపాలక సంస్థ కమీషనర్ గిరిష స్పష్టం చేశారు.
తిరుపతి: కోవ్యాక్సిన్ రెండవ డోసును అందరికీ వేస్తామని, నగరవాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నగరపాలక సంస్థ కమీషనర్ గిరిష స్పష్టం చేశారు. ఏప్రిల్ 12 ముందు మెదటి డోసు వేసుకున్న అందరికీ వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. నగరంలో 5,500 మంది రిజిస్ట్రేషన్ అయిన వారికి మాత్రమే రెండవ విడత డోసు వేస్తామని చెప్పారు. రిజిస్టర్ కాని, టోకన్లేని వారికి 20 తరువాత వ్యాక్సిన్ వేయనున్నట్లు గిరిష తెలిపారు.
Updated Date - 2021-05-17T17:41:58+05:30 IST