బీరకుప్పం తాగునీటి పథకం పూర్తికి గడువు పొడిగింపు
ABN, First Publish Date - 2021-06-20T05:41:02+05:30
సత్యవేడు నియోజకవర్గంలోని బీరకుప్పం గ్రామానికి మంజూరైన కేంద్ర రక్షిత నీటి సరఫరా (సీపీడబ్ల్యుఎస్) పథకం పూర్తి చేయడానికి గడువు పొడిగిస్తూ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది శనివారం ఆదేశాలు జారీ చేశారు.
కలికిరి, జూన్ 19: సత్యవేడు నియోజకవర్గంలోని బీరకుప్పం గ్రామానికి మంజూరైన కేంద్ర రక్షిత నీటి సరఫరా (సీపీడబ్ల్యుఎస్) పథకం పూర్తి చేయడానికి గడువు పొడిగిస్తూ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది శనివారం ఆదేశాలు జారీ చేశారు. రూ. 3 కోట్ల అంచనాతో ఈ రక్షిత నీటి సరఫరాను బీరకుప్పంతోపాటు మరో 9 కుగ్రామాలకు నీటి సరఫరా చేసే పనులు చేయ డానికి 2018 సెప్టెంబరులో కాంట్రాక్టరుకు అప్పగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీ నాటికి తాగునీటి సరఫరా జరగాల్సి ఉంది. అయితే గడువులోగా పనులు పూర్తి కాకపోవడంతో ఆగస్టు 31వ తేదీ వరకూ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
Updated Date - 2021-06-20T05:41:02+05:30 IST