ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యలేని బతుకెందుకని..!

ABN, First Publish Date - 2021-03-03T06:07:35+05:30

భార్య లేని బతుకు శూన్యమనుకున్నాడో భర్త. ప్రమాదవశాత్తు చనిపోయిన భార్య స్మృతుల్లో పడి కొట్టుకులాడాడు. ప్రాణాలు పోతున్నంతగా వగచి విలపించాడు. భార్య మృతి చెంది నెల్లాళ్లు కూడా తిరక్కుండానే ఉరేసుకుని ఆమె వెంట పయనమై వెళ్లిపోయాడు.

రవిప్రసాద్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న భర్త

కుప్పం/ కుప్పం రూరల్‌, మార్చి 1: భార్య లేని బతుకు శూన్యమనుకున్నాడో భర్త. ప్రమాదవశాత్తు చనిపోయిన భార్య స్మృతుల్లో పడి కొట్టుకులాడాడు. ప్రాణాలు పోతున్నంతగా వగచి విలపించాడు. భార్య మృతి చెంది నెల్లాళ్లు కూడా తిరక్కుండానే ఉరేసుకుని ఆమె వెంట పయనమై వెళ్లిపోయాడు. కుటుంబంలో మిగిలిన వారితోపాటు గ్రామం మొత్తాన్ని విషాదంలో ముంచిన ఈ విషాద సంఘటన కుప్పం మండలం కృష్ణదాసనపల్లె పంచాయతీ ఒంటూరు (చింపనగల్లు) గ్రామంలో జరిగింది. ఒంటూరుకు చెందిన మునిలాల్‌, రవిప్రసాద్‌ అన్నాదమ్ముళ్లు. టైల్స్‌ పనిచేసుకుని వీరిద్దరూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇలా ఉండగా మునిలాల్‌ భార్య రుక్మిణి, రవిప్రసాద్‌ భార్య రాజేశ్వరి గత నెల ఫిబ్రవరి నాల్గవ తేదీన బట్టలు ఉతకడానికని సమీపంలోని చెరువు  వద్దకు వెళ్లారు. రుక్మిణి బిడ్డలైన ఆరతి, కీర్తి సైతం వారి వెంట బయలుదేరారు. తోడికోడళ్లు బట్టలు ఉతుకుతుండగా చిన్నారులిద్దరూ ఆడుకుంటూ చెరువు లోపలివైపుకెళ్లి, అక్కడ గతంలో తవ్వివున్న ఉపాధి కుంటలో పడ్డారు. వారిని కాపాడబోయిన తోడికోడళ్లు రుక్మిణి, రాజేశ్వరిలతోపాటు చిన్నారులిద్దరూ అదే కుంటలో పడి మృతి చెందారు. ఈ సంఘటన జరిగినప్పటినుంచీ మృతురాలు రాజేశ్వరి భర్త రవిప్రసాద్‌ (35) ముభావంగా మారిపోయాడు. ఎప్పుడు చూసినా భార్య స్మృతులలోనే ఉండేవాడు. భార్యతోపాటు అల్లారుముద్దుగా పెంచిన అన్న బిడ్డలిద్దరినీ కూడా గుర్తు తెచ్చుకుని విషాదంలోకి జారిపోయేవాడు. కూలీ పనులకు వెళ్లడం కూడా మానుకుని ఊళ్లోనే చెట్టూపుట్టా పట్టుకుని తిరుగుతూ గతం తలచుకుని వగచేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పొలాల వద్ద ఉన్న రేకుల షెడ్డులాంటి ఇంట్లో రవిప్రసాద్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  రవిప్రసాద్‌ ఆత్మహత్య చేసుకోవడం గ్రామస్తులందరినీ తీవ్ర విషాదంలో ముంచింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. రవిప్రసాద్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఎస్‌ఐ నరేంద్ర మాట్లాడుతూ భార్య మరణించిందన్న మనస్తాపంతోనే రవిప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Updated Date - 2021-03-03T06:07:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising