ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకరి అజాగ్రత్తకు ఇంకొకరి దుర్మరణం

ABN, First Publish Date - 2021-01-20T06:59:34+05:30

జాతీయ రహదారి పక్కన నిలిపిన కారు డోర్‌ను అజాగ్రత్తగా తీయడంతో.. పక్కనే వస్తున్న ద్విచక్ర వాహనదారుడికి తగిలింది.

నరేంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కారు డోరు తగిలి బైకు బోల్తా

లారీ దూసుకెళ్లడంతో అసువులు బాసిన స్విమ్స్‌ ఉద్యోగి 


చంద్రగిరి, జనవరి 19: జాతీయ రహదారి పక్కన నిలిపిన కారు డోర్‌ను అజాగ్రత్తగా తీయడంతో.. పక్కనే వస్తున్న ద్విచక్ర వాహనదారుడికి తగిలింది. ఆయన కింద పడటంతో వెనకే వస్తున్న లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటన చంద్రగిరి మండలం కాశిపెంట్ల వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పాకాల మండలం ఇరంగారిపల్లెకు చెందిన నరిసింహులుశెట్టి కుమారుడు నరేంద్రకుమార్‌(43) తిరుపతి స్విమ్స్‌లో రేడియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. డ్యూటీకోసం మంగళవారం స్వగ్రామం ద్విచక్ర వాహనంపై తిరుపతికి బయలుదేరారు. కాశిపెంట్ల వద్దకు రాగానే రోడ్డు పక్కన నిలిపిన కారులో ఉన్న ప్రయాణికులు ఉన్నట్లుండి డోరు తెరిచారు. ఈ డోరు తగిలడంతో ద్విచక్ర వాహనం సహా నరేంద్రకుమార్‌ రోడ్డుపై పడిపోయారు. వెనకే వస్తున్న వేగంగా వస్తున్న లారీ నరేంద్రకుమార్‌ తలపై దూసుకెళ్లడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-20T06:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising