ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-09-17T07:31:43+05:30

గోవిందరాజ స్వామి ఆలయంలో గురువారం ఉదయం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(కల్చరల్‌), సెప్టెంబరు 16: గోవిందరాజ స్వామి ఆలయంలో  గురువారం ఉదయం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి  తోమాల సేవ, సహస్ర నామార్చన చేపట్టారు. కొవిడ్‌ నేపథ్యంలో ఆలయంలో సేవలన్నీ ఏకాంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే శ్రీదేవి, భూదేవి సహిత గోవిందరాజస్వామి ఉత్సవర్లను ఆలయంలోని యాగశాలకు వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుంచి 9.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేశారు. యాత్రికుల వల్లగాని, సిబ్బంది వల్లగాని తెలిసో తెలియకో జరిగే దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో  జీయర్‌ స్వాములతో పాటు ఆలయ ప్రధానార్చకుడు శ్రీనివాసదీక్షితులు,  ఆలయ డిప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఆగమ సలహాదారులు వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ఏఈవో రవికుమార్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ నారాయణ, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ కామరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-09-17T07:31:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising