హడలెత్తించిన నాగుపాము
ABN, First Publish Date - 2021-07-25T07:15:22+05:30
తిరుమలలో శనివారం ఓ నాగుపాము భక్తులను హడలెత్తించింది.
తిరుమల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో శనివారం ఓ నాగుపాము భక్తులను హడలెత్తించింది. ఎస్వీ మ్యూజియం పక్కనే ఉన్న గుబ్బా సత్రాల్లోకి సుమారు ఐదున్నర అడుగుల పొడవున్న నాగుపాము చొరబడింది. దీన్నిచూసిన భక్తులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వెంటనే పాములు పట్టే భాస్కర్నాయుడికి సమాచారమిచ్చారు. ఆయనొచ్చి.. ఆ పామును పట్టుకుని, దట్టమైన అడవిలో వదిలిపెట్టారు.
Updated Date - 2021-07-25T07:15:22+05:30 IST