వైసీపీ పాలనలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశారు టీడీపీ మైనార్టీ నాయకులు
ABN, First Publish Date - 2021-11-27T05:44:45+05:30
వైసీపీ పాలనలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశారని టీడీపీ జిల్లా మైనారిటీ విభాగం మాజీ అధ్యక్షుడు ఎస్ఎం.రఫి ధ్వజమెత్తారు.
మదనపల్లె టౌన్, నవంబరు 26: వైసీపీ పాలనలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశారని టీడీపీ జిల్లా మైనారిటీ విభాగం మాజీ అధ్యక్షుడు ఎస్ఎం.రఫి ధ్వజమెత్తారు. శుక్రవారం టీడీపీ కా ర్యాలయంలో ఆయన మీడియాతో మాట్లా డుతూ... వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్న రేళ్లలో అనేక మంది ముస్లిం మైనారిటీలపై దాడు లు జరిగాయన్నారు. నంద్యాలలో అబ్దుల్ సలాం, గురజాలలో షేక్ షావలి, పిడుగురాళ్ల వద్ద సైదా అనే టీడీపీ నాయకుడిపై వైసీపీ మద్దతుదారులు దాడులు జరిపారన్నారు. వైసీపీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాలపై దాడులు చేస్తున్నారన్నారు. సామాన్య ప్రజలకు రక్షణ కరువైందన్నారు. ఇటువంటి దాడులను ఇక సహించేది లేదని, రానున్న రోజుల్లో బుద్ధి చెబుతామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-11-27T05:44:45+05:30 IST