మిద్దెపై నుంచి దూకి బాలుడి మృతి
ABN, First Publish Date - 2021-08-03T06:57:33+05:30
కోతుల నుంచి తప్పించుకునే క్రమంలో మిద్దెపై నుంచి దూకడంతో పునీత్ (12) మృతిచెందాడు.
చంద్రగిరి, ఆగస్టు 2: కోతుల నుంచి తప్పించుకునే క్రమంలో మిద్దెపై నుంచి దూకడంతో పునీత్ (12) మృతిచెందాడు. ఈ విషాద ఘటన చంద్రగిరి మండలం పనపాకం పేటలో సోమవారం చోటుచేసుకుంది. మిద్దెపై ఇద్దరు పిల్లలు అడుకుంటుండగా, వీరి వద్దనున్న తిండి పదార్థాలను కోతులు ఎత్తుకెళ్లాయి. దీంతో ఇద్దరూ కట్టెలు తీసుకొని కోతులను తరిమేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కోతులు తిరగబడి పిల్లల వెంట పడ్డాయి. భయంతో వీటి నుంచి తప్పించుకునే క్రమంలో ఒకరు మెట్ల గుండా కిందికి దిగిపోగా, పునీత్ మిద్డెపై నుంచి కిందకు దూకాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో పనపాకంపేటలో విషాదం నెలకొంది.
Updated Date - 2021-08-03T06:57:33+05:30 IST