కుప్పం ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ
ABN, First Publish Date - 2021-10-30T16:10:58+05:30
కుప్పం ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం సమావేశమయ్యారు.
చిత్తూరు: కుప్పం ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం సమావేశమయ్యారు. మునిసిపల్ ఎన్నికల విషయంపై చర్చించే అవకాశం ఉంది. మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు అధినేత వద్దకు భారీగా అభ్యర్థులు చేరుకుంటున్నారు. ఈరోజు వార్డు సభ్యులను అధినేత ఎంపిక చేసే అవకాశం ఉంది. మునిసిపల్ ఎన్నికల్లో వ్యూహాలపై అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తలోగ్గదని కార్యకర్తలకు, నాయకులకు, అభ్యర్థులకు చంద్రబాబు సూచనలు చేశారు.
Updated Date - 2021-10-30T16:10:58+05:30 IST