రాళ్లదాడిపై ఆధారాలు సమర్పించండి
ABN, First Publish Date - 2021-04-14T06:54:05+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు సభపై జరిగిన రాళ్లదాడికి సంబంధించిన ఆధారాలను అందజేయాలని కోరుతూ అర్బన్ పోలీసులు మంగళవారం టీడీపీ నేత నరసింహయాదవ్కు నోటీసులు అందజేశారు.
టీడీపీ నేత నరసింహయాదవ్కు నోటీసులు అందజేసిన పోలీసులు
తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 13: టీడీపీ అధినేత చంద్రబాబు సభపై జరిగిన రాళ్లదాడికి సంబంధించిన ఆధారాలను అందజేయాలని కోరుతూ అర్బన్ పోలీసులు మంగళవారం టీడీపీ నేత నరసింహయాదవ్కు నోటీసులు అందజేశారు.నోటీసు అందిన ఒకట్రెండు రోజుల్లో ఆధారాలను సమర్పించా లని అందులో పేర్కొన్నారు. కాగా, చంద్రబాబు రోడ్డు షోలో రాళ్లదాడి జరిగినట్టు ఆధారాల్లేవని డీఐజీ క్రాంతిరాణా టాటా మంగళవారం ప్రకటించడంపై నరసింహయాదవ్ స్పందించారు. ఈ కేసును నీరుగార్చేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పూర్థిస్తాయిలో విచారణ చేయకుండానే ఈ తరహా ప్రకటన చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఫిర్యాదులో సీఎం జగన్ పేరు ప్రస్తావించడంతో కేసు మూసివేయడానికి చూస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. రాళ్లదాడిపై ఆధారాలి వ్వాలంటూ తమకు నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాగా, రాళ్లదాడిలో గాయపడిన వారిని విచారణ పేరుతో గంటలపాటు పోలీస్స్టేషన్లో ఉంచారని ఆందోళన వ్యక్తంచేశారు.
Updated Date - 2021-04-14T06:54:05+05:30 IST