ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక హోదా ఇవ్వాలి

ABN, First Publish Date - 2021-07-31T07:42:23+05:30

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న లక్ష్మణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రానికి జన చైతన్య వేదిక అధ్యక్షుడి డిమాండ్‌ 


తిరుపతి(తిలక్‌రోడ్డు), జూలై 30: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి డిమాండ్‌ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నీరుగార్చిందని ఆరోపించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి పునరావాసంతో పాటు నిర్మాణానికి నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండు చేశారు. రాయలసీమ మేధావుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడాన్ని అభినందించారు. విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో వెలుగొండ ప్రాజెక్టును పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజానేస్తం రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా కోసం అందరం కలసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు దేవరాజులు, రఫీ, కిరణ్‌కుమార్‌రెడ్డి, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T07:42:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising