వ్యర్థాల విక్రయం తగదు
ABN, First Publish Date - 2021-10-18T06:06:36+05:30
వ్యర్థాలను ప్రభుత్వం విక్రయించడం అన్యాయమని పురపాలక సంఘ పారిశుధ్య కార్మికులు వాపోయారు.
శ్రీకాళహస్తి, అక్టోబరు 17: వ్యర్థాలను ప్రభుత్వం విక్రయించడం అన్యాయమని పురపాలక సంఘ పారిశుధ్య కార్మికులు వాపోయారు. ఆదివారం పట్టణ పాతబస్టాండు కూడలి వద్ద ఆందోళన నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ... ఏళ్లుగా కార్మికులుగా పనిచేస్తున్న తాము ప్లాస్టిక్ చిత్తు కవర్లను పోగు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు. వచ్చిన నగదును చిన్నపాటి ఖర్చులకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చిత్తు కవర్లు కార్మికులు తీసుకోరాదని అధికారులు ఆదేశాలు జారీ చేయడం బాధాకరమన్నారు.
Updated Date - 2021-10-18T06:06:36+05:30 IST