ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్రచందనం దుంగల పట్టివేత

ABN, First Publish Date - 2021-07-22T16:04:59+05:30

పీలేరు - తిరుపతి మార్గంలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భాకరాపేట: పీలేరు - తిరుపతి మార్గంలో భాకరాపేట అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్సు డీఎస్పీ మురళీధర్‌ తెలిపారు. భాకరాపేట ఘాట్‌ రోడ్డులో ఆర్‌ఎస్‌ఐలు విశ్వనాథం, లింగాధర్‌ టీమ్‌లు మంగళవారం రాత్రి ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లలో తనిఖీలు చేపట్టగా దొనకొండ గంగమ్మగుడి సమీపంలో కొంతమంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తుండగా టాస్క్‌ఫోర్సు సిబ్బంది చుట్టుముట్టారు. దీంతో దుండగులు దుంగలు పడవేసి చీకటిలో పారిపోయారన్నారు. ఆ ప్రాంతంలో గాలించగా 200కిలోల బరువు ఉన్న ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు సీఐ చంద్రశేఖర్‌ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో సీఐలు సుబ్రహ్మణ్యం, వెంకటరవి, డీఆర్వో నరసింహారావు, ఆర్‌ఎస్‌ఐ సురేష్‌ , టాస్క్‌ఫోర్సు పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-22T16:04:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising