ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సౌకర్యం
ABN, First Publish Date - 2021-09-29T06:32:40+05:30
శ్రీకాళహస్తి కార్గో కేంద్రంలో తూపే సౌకర్యం కల్పిస్తున్నట్లు తిరుపతి ఆర్టీసీ కమర్షియల్ మేనేజర్ పీఎల్ఈ సుబ్బారావు తెలిపారు.
పీలేరు, సెప్టెంబరు 28: పట్టణ డిపోలోని కార్గో కేంద్రంలో తూపే సౌకర్యం కల్పిస్తున్నట్లు తిరుపతి ఆర్టీసీ కమర్షియల్ మేనేజర్ పీఎల్ఈ సుబ్బారావు తెలిపారు. మంగళవారం ఆయన కార్గో కేంద్రంలో డోర్ డెలివరీ సేవలను తనిఖీ చేశారు. పీఎల్ఈ మాట్లాడుతూ... తూపే సౌకర్యం ద్వారా వినియోగదారులు పీలేరులో డోర్ డెలివరి బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం పది కిలోల వరకు ఈ సౌకర్యం ఉండగా, 50కిలోల వరకు పెంచే అవకాశం ఉందన్నారు. పట్టణ ప్రజలు తిరుపతి, చిత్తూరు, విజయవాడ, రాజమండ్రి, అనంతపురం, కడప, ఏలూరు, కాకినాడ తదితరప్రాంతాలకు డోర్ డెలివరీ ద్వారా పార్సిళ్లను పంపవచ్చని తెలిపారు.
Updated Date - 2021-09-29T06:32:40+05:30 IST