14 నుంచి ముస్లిం ఉద్యోగుల పని వేళల తగ్గింపు
ABN, First Publish Date - 2021-04-13T05:50:30+05:30
రంజాన్ మాసాన్ని పురష్కరించుకుని ముస్లిం ఉద్యోగుల పని వేళల్లో సడలింపు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సోమవారం జిల్లా అధికారులకు అందాయి.
చిత్తూరు(సెంట్రల్), ఏప్రిల్ 12: రంజాన్ మాసాన్ని పురష్కరించుకుని ముస్లిం ఉద్యోగుల పని వేళల్లో సడలింపు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సోమవారం జిల్లా అధికారులకు అందాయి. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, గ్రామ, వార్డు వలంటీర్లు, కార్యదర్శులు ఈనెల 14నుంచి మే 13వ తేదీ వరకు పనిదినాల్లో సాయంత్రం వేళ గంట ముందుగా వెళ్లవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Updated Date - 2021-04-13T05:50:30+05:30 IST