ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14న భగవద్గీత అఖండ పారాయణం

ABN, First Publish Date - 2021-12-08T07:25:25+05:30

తిరుమల నాదనీరాజనం వేదికపై గీతాజయంతిని పురస్కరించుకుని ఈనెల 14వ తేదీన సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం నిర్వహించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

టీటీడీ అధికారులతో సమావేశమైన అదనపు ఈవో ధర్మారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, డిసెంబరు7(ఆంధ్రజ్యోతి): తిరుమల నాదనీరాజనం వేదికపై గీతాజయంతిని పురస్కరించుకుని ఈనెల 14వ తేదీన సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం నిర్వహించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన గీతాజయంతి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఆ రోజు ఉదయం 7 నుంచి మఽధ్యాహ్నం 12 గంటల వరకు భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలను నిరంతరాయంగా పారాయణం చేయనున్నట్లు చెప్పారు. ఈ శ్లోకాలను కాశీపతి పారాయణం చేయగా, కుప్పా విశ్వనాథశాస్త్రి వ్యాఖ్యానం చేస్తారన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నందున అవసరమైన ఇంజినీరింగ్‌ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎస్వీబీసీలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గీతా పారాయణం సింహభాగంలో ఉన్నట్లు, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు భగవద్గీత పారాయణం వీక్షించి, మళ్లీ, మళ్లీ ప్రసారం చేయమని కోరుతున్నారన్నారు. ఈ సమావేశంలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, సీఈవో సురే్‌షకుమార్‌, ఎస్‌ఈ2 జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీఈవో రమే్‌షబాబు, హెల్త్‌ఆఫీసర్‌ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T07:25:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising