కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా రాజేంద్ర నాయుడు
ABN, First Publish Date - 2021-06-14T06:45:02+05:30
కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా రాజేంద్ర నాయుడు నియమితులయ్యారు.
తిరుపతి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా రాజేంద్ర నాయుడు నియమితులయ్యారు. పార్టీ అధిష్ఠాన నిర్ణయం మేరకు కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి గురునాఽథరావు ఆదివారం నియామకపత్రం పంపారు. తనపై నమ్మకం ఉంచిన రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్కు రాజేంద్ర నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలపై పోరాడతానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Updated Date - 2021-06-14T06:45:02+05:30 IST