అమ్మవారి సేవలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్
ABN, First Publish Date - 2021-06-14T06:40:55+05:30
తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం దర్శించుకున్నారు.
తిరుచానూరు, జూన్ 13: తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం దర్శించుకున్నారు. శ్రీవారి దర్శానానంతరం తిరుచానూరుకు చేరుకున్న ఆయనకు ఆలయ మహద్వారం వద్ద రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీటీడీ జేఈవో సదా భార్గవి, అర్చకులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపల కేంద్రమంత్రిని బీజేపీ నాయకులు భానుప్రకాష్రెడ్డి, గుండాల గోపీనాథ్, సుబ్రహ్మణ్యంరెడ్డి తదితరులు సన్మానించారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ అంగడిలో కేంద్రమంత్రి తేనీరు సేవించాక.. విమానాశ్రయానికి బయల్దేరారు. ఈ కార్యక్రమంలో రైల్వే, టీటీడీ అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-14T06:40:55+05:30 IST