ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్చువల్‌ పద్ధతిలో రేపు పుంగనూరు ఆర్టీసీ డిపో ప్రారంభం

ABN, First Publish Date - 2021-05-05T06:14:32+05:30

ఈ నెల 6వ తేదీన వర్చువల్‌ పద్ధతిలో సీఎం జగన్‌ , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పురంగనూరు ఆర్టీసీ డిపోను ప్రారంభిస్తారని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

ఆర్టీసీ డిపో పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుంగనూరు రూరల్‌, మే 4: ఈ నెల 6వ తేదీన వర్చువల్‌ పద్ధతిలో సీఎం జగన్‌  , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  పురంగనూరు ఆర్టీసీ డిపోను ప్రారంభిస్తారని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. మదనపల్లె సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ చెంగల్‌రెడ్డితో కలసి మంగళవారం  పుంగనూరు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఏపీఎ్‌సఆర్టీసీ డిపో పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపోలో ఏర్పాటు చేస్తున్న శిలాఫలకాలు, ప్రారంభం చేసే సమయంలో 50మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పుంగనూరు నుంచి బస్సులు ఏ ప్రాంతాలకు వెళుతాయని ఆర్‌ఎంను అడిగితెలుసుకున్నారు. ప్రస్తుతం 66 సర్వీసులు అందబాటులో ఉన్నట్లు వివరించారు.  పుంగనూరు నుంచి తిరుమల, తిరుపతి, హైదరాబాదు, చెన్నై, విజయవాడ, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, కడప, రాయచోటి, కదిరి, బెంగళూరు, ముళబాగళ్‌, పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బస్సులు వెళుతాయని తెలిపారు. ఆయన వెంట ఆర్టీసీ డివిజనల్‌ మేనేజర్‌ భాస్కర్‌రెడ్డి, మేనేజర్‌ సుధాకర్‌, తహసీల్దార్‌ వెంకట్రాయులు, ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-05T06:14:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising