ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీసీ మిల్లులో ఉత్పత్తిని పునఃప్రారంభించాలి

ABN, First Publish Date - 2021-12-01T06:00:13+05:30

రేణిగుంట సమీపంలోని తిరుపతి కాటన్‌మిల్లులో ఉత్పత్తిని పునఃప్రారంభించాలని కార్మికసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

ధర్నా చేస్తున్న కార్మికసంఘాల నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేణిగుంట, నవంబరు 30: మండలకేంద్ర సమీపంలోని తిరుపతి కాటన్‌మిల్లులో ఉత్పత్తిని పునఃప్రారంభించాలని కార్మికసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం రేణిగుంట-పుత్తూరు మార్గంలోని కాటన్‌మిల్లు ఎదుట కార్మికసంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. సీపీఎం నేత శివానందం, బీఎంఎ్‌స నేతలు జ్ఞానశేఖర్‌, శివకుమార్‌ మాట్లాడుతూ... కాటన్‌ మిల్లును మూసివేసేందుకు గత పాలకప్రభుత్వాలు కుట్ర చేసినట్లు చెప్పారు. దీంతో 20శాతానికి ఉత్పత్తి సామర్థ్యం పడిపోయిందని వాపోయారు. ఈ మిల్లుకు నాణ్యతలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందనీ, కేంద్రప్రభుత్వం స్పందించి మిల్లు సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎంపీపీ హరిప్రసాద్‌రెడ్డి, తూకివాకం సర్పంచ్‌ మునిశేఖర్‌ ధర్నాకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి, సెల్వరాజ్‌, పళని, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-01T06:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising