శ్రీవారిసేవలో తమిళనటుడు ప్రభు
ABN, First Publish Date - 2021-09-29T06:20:57+05:30
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని మంగళవారం ప్రముఖ తమిళ సినీనటుడు ప్రభు దర్శించుకున్నారు.
తిరుమల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని మంగళవారం ప్రముఖ తమిళ సినీనటుడు ప్రభు దర్శించుకున్నారు. ఆయన కుమారుడు, హీరో విక్రమ్ ప్రభు, కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం వీఐపీ బ్రేక్లో స్వామిని దర్శించుకున్నారు. ఆలయం ముందు ప్రభు మీడియాతో మాట్లాడుతూ.. మాస్కుతో సినిమాల్లో నటించడం సాధ్యం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీపరిశ్రమలన్నీ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నాయన్నారు. త్వరలో ఈ పరిస్థితుల నుంచి బయటపడాలని స్వామిని ప్రార్థించానన్నారు. రామోజీ ఫిలిం సిటీలో తన చిత్రం షూటింగ్ పూర్తయిన సందర్భంగా స్వామి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చినట్లు హీరో విక్రమ్ ప్రభు తెలిపారు. ఆలయం ముందు వీరిని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు.
Updated Date - 2021-09-29T06:20:57+05:30 IST