కర్ణాటక మద్యం తరలింపు : ఒకరి అరెస్టు
ABN, First Publish Date - 2021-10-24T06:19:25+05:30
కర్ణాటక మద్యం తరలిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు వాల్మీకిపురం ఎన్ఫోర్స్మెంట్ సీఐ శివసాగర్ తెలిపారు.
గుర్రంకొండ, అక్టోబరు 23: కర్ణాటక మద్యం తరలిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు వాల్మీకిపురం ఎన్ఫోర్స్మెంట్ సీఐ శివసాగర్ తెలిపారు. మండలంలోని సంగసముద్రం పంచాయతీ యల్లంపల్లెకు చెందిన ఓ వ్యక్తి గ్రామానికి సమీపంలోని పొలంలో కర్ణాటక మద్యం ఉంచి విక్ర యానికి తరలిస్తుండగా దాడలు చేసి అరెస్టు చేశారు. అతడి నుంచి 281 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండుకు పంపినట్లు ఆయన తెలిపారు.
Updated Date - 2021-10-24T06:19:25+05:30 IST