మహానంది ఆలయానికి పట్టు వస్త్రాల సమర్పణ
ABN, First Publish Date - 2021-03-07T04:41:32+05:30
కర్నూలు జిల్లా మహానంది ఆలయానికి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తరపున ఈవో వెంకటేశు పట్టువస్త్రాలను శనివారం సమర్పించారు.
ఐరాల(కాణిపాకం), మార్చి 6: కర్నూలు జిల్లా మహానంది ఆలయానికి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తరపున ఈవో వెంకటేశు పట్టువస్త్రాలను శనివారం సమర్పించారు. మహానంది ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కాణిపాక ఆలయం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. మహానంది ఆలయ ఈవో మల్లికార్జునప్రసాద్ కాణిపాక ఆలయ ఈవో ఈవో వెంకటేశు నుంచి పట్టు వస్త్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కోదండపాణి, ఆలయ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-07T04:41:32+05:30 IST