రోజా మాటే చెల్లుబాటు... నేడు నిండ్ర ఎంపీపీ ఎన్నిక
ABN, First Publish Date - 2021-10-08T17:52:27+05:30
నగరి నియోజకవర్గం పరిధిలోని నిండ్ర ఎంపీపీ ఎన్నికపై ప్రతిష్టంభన తొలగిపోయింది.
చిత్తూరు జిల్లా: నగరి నియోజకవర్గం పరిధిలోని నిండ్ర ఎంపీపీ ఎన్నికపై ప్రతిష్టంభన తొలగిపోయింది. వైసీపీ అధిష్టానం వద్ద ఎమ్మెల్యే రోజా మాటే చెల్లుబాటు అయింది. రోజా, చక్రపాణిల మధ్య నిండ్ర ఎంపీపీ ఎన్నిక శుక్రవారం జరగనుంది. రోజా సూచించిన అభ్యర్థినే ఎంపీపీగా ఎన్నుకోవాలని హైకమాండ్ నిర్ణయించడంతో ఇవాళ నిండ్ర ఎంపీపీ ఎన్నిక జరగనుంది.
ఎమ్మెల్యే రోజా సూచించిన ఎలకటూరు ఎంపీటీసీ దీప ఎంపీపీగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిండ్ర మండల పరిషత్ ఎన్నికల్లో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలకు గానూ 7 వైసీపీకి, 1 టీడీపీకి దక్కాయి. అయితే వైసీపీ ఎంపీటీసీలు ఏడుగురిలో ఐదుగురు చక్రపాణి రెడ్డి వర్గీయులు. మిగిలిన ఇద్దరు రోజా వర్గీయులు. ఎంపీపీ అభ్యర్థిని నిర్ణయించే విషయంలో ఈ వర్గాల నడుమ సయోధ్య కుదరలేదు. ఇరువర్గాలు పట్టుదలకుపోయాయి.
Updated Date - 2021-10-08T17:52:27+05:30 IST