ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశం కోసం నా కుమారుడు ప్రాణాలర్పించడం గర్వంగా ఉంది: సాయితేజ తండ్రి మోహన్

ABN, First Publish Date - 2021-12-10T17:51:27+05:30

దేశం కోసం తన కుమారుడు ప్రాణాలర్పించడం గర్వంగా ఉందని సాయితేజ తండ్రి మోహన్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా: దేశం కోసం తన కుమారుడు ప్రాణాలర్పించడం గర్వంగా ఉందని సాయితేజ తండ్రి మోహన్ అన్నారు. తనకు ఆర్మీలో చేరే అవకాశం దక్కలేదని ఇద్దరు కుమారులు సైన్యంలో చేరినప్పుడు చాలా సంతోషపడ్డానని చెప్పారు. సాయితేజ మరణించడంతో పెద్ద దిక్కును కోల్పోయామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తన కుమారుడు ఆర్మీలో చేరి ఉన్నతస్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉందని.. ఇలాంటి సమయంలో సాయితేజ ప్రమాదంలో మరణించడం చాలా బాధగా ఉందన్నారు. తన రెండో కొడుకు హిమాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నాడని, నిన్ననే ఇంటికి వచ్చాడని తెలిపారు. తన ఇద్దరు కుమారులు రెండు కళ్లుగా భావించానని, ఒక కన్ను పోయిందన్నారు. సాయితేజకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, అతని భార్య చదువుకుందని, ఆమెకు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబం నిలబడుతుందని మోహన్ అన్నారు.


కాగా సాయితేజ కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీలకు అతీతంగా అన్నీ పార్టీల నేతలు తరలి వస్తున్నారు. టీడీపీకి చెందిన కొంతమంది నాయకులు మోహన్ కుటుంబాన్ని పరామర్శించి, వాళ్లకు ధైర్యం చెప్పారు.

Updated Date - 2021-12-10T17:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising