ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ఆదుకుంటాం: డిప్యూటీ సీఎం

ABN, First Publish Date - 2021-05-14T06:00:31+05:30

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు.

మెగా చెక్కును ఆవిష్కరిస్తున్న నారాయణస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, మే 13: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని డిప్యూటీ  సీఎం నారాయణస్వామి చెప్పారు. రైతు భరోసా నగదును రైతుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమాన్ని గురువారం వెలగపూడి నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించగా, కలెక్టరేట్‌ నుంచి డిప్యూటీ సీఎంతోపాటు ప్రభుత్వ విప్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్‌ అముద, కలెక్టర్‌ హరినారాయణన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి రైతు భరోసా కింద 4,60,389 మంది రైతులకు మొదటి విడత లబ్ధిగా రూ.345.89 కోట్ల మెగా చెక్కును డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి నవరత్నాలను పూర్తి స్థాయిలో సీఎం జగన్‌ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. కరోనాను అరికట్టడానికి శ్రమిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని అభినందించారు. జేసీ రాజశేఖర్‌, డీఆర్వో మురళి, వ్యవసాయశాఖ  జేడీ దొరసాని, ఏడీఏ శివకుమార్‌, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయానందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-14T06:00:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising