కృష్ణగిరి టు కుప్పం
ABN, First Publish Date - 2021-09-12T07:11:01+05:30
పడమటి మండలాల రైతులు ఇప్పటికే 55 ఏనుగులతో పంట నష్టాలతో బాధపడుతున్న నేపథ్యంలో తాజాగా శుక్రవారం మరో 45 ఏనుగుల గుంపు తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి అటవీ ప్రాంతం నుంచి కుప్పం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తమిళనాడు నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించిన 45 ఏనుగులు
పలమనేరు, సెప్టెంబరు 11 : పడమటి మండలాల రైతులు ఇప్పటికే 55 ఏనుగులతో పంట నష్టాలతో బాధపడుతున్న నేపథ్యంలో తాజాగా శుక్రవారం మరో 45 ఏనుగుల గుంపు తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి అటవీ ప్రాంతం నుంచి కుప్పం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణగిరి అటవీ ప్రాంతంలోని సుమారు 45 ఏనుగుల గుంపు అక్కడి అటవీ సరిహద్దు గ్రామానికి చెందిన ఇద్దరు రైతులను శుక్రవారం దాడిచేసి చంపేశాయని, దీంతో అక్కడి అటవీ ప్రాంత అధికారులు, రైతులు బాణసంచా పేల్చుతూ ఏనుగుల గుంపును కుప్పం అటవీ ప్రాంతంలోకి తరిమివేసినట్లు తెలుస్తోంది.తమిళనాడు అటవీ అధికారులను సంప్రదించి వెంటనే వాటిని మళ్లీ తమిళనాడు అటవీ లోతట్టు ప్రాంతాలకు తరలించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు.
Updated Date - 2021-09-12T07:11:01+05:30 IST