ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయురాలి మృతి

ABN, First Publish Date - 2021-03-02T05:54:13+05:30

తొట్టంబేడు మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు మాలిని సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, మార్చి 1: అనుమానాస్పద స్థితిలో తొట్టంబేడు మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయురాలు సోమవారం మృతిచెందారు. వివరాలివీ.. తొట్టంబేడు మండలం కంచనపల్లెకు చెందిన మాలిని(40) కేవీబీపురం మండలం కాళంగిఆదరం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త భుజంగరావు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, ప్రస్తుతం కంచనపల్లెలో కాపురం ఉంటున్నారు. కాగా, సోమవారం ఉదయం విధులకు వెళ్లిన ఆమె సాయంత్రం ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో మాలిని ఆరోగ్యం బాగోలేదంటూ రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులు శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయురాలు మృతిచెందడంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది. 

Updated Date - 2021-03-02T05:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising