ప్రధాని మోదీతోనే ఓబీసీలకు న్యాయం
ABN, First Publish Date - 2021-08-03T06:33:25+05:30
దేశంలో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్ కల్పించి వారి చిరకాల ఆకాంక్షను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నెరవేర్చారని ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు బి.శివనారాయణ అన్నారు.
ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శివనారాయణ
మదనపల్లె రూరల్, ఆగష్టు 2: దేశంలో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్ కల్పించి వారి చిరకాల ఆకాంక్షను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నెరవేర్చారని ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు బి.శివనారాయణ అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాలులో ఓబీసీ మోర్చా రాజంపేట జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీని బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ... కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యల్లంపల్లె ప్రశాంత్, జర్మన్ రాజు, కిరణ్, రేవతి, నాగిరెడ్డి, శివప్రసాద్, బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-03T06:33:25+05:30 IST