భూ ఆక్రమణలపై విచారణ చేపట్టండి: సీపీఐ
ABN, First Publish Date - 2021-06-20T05:55:52+05:30
మదనపల్లె పట్టణంలో భూ ఆక్రమణలపై సమగ్ర సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
మదనపల్లె అర్బన్, జూన్ 19: పట్టణంలో భూ ఆక్రమణలపై సమగ్ర సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం జరిగిన నిరసన కార్యక్రమంలో సీపీఐ నాయకులు మాట్లాడుతూ మదనపల్లె పట్టణం, పరిసర ప్రాంతాల్లో భూ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ స్పందించి ఇతర మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులతో విచారణ చేపట్టాలని కోరారు. కొంతమంది అవినీతి రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రభుత్వ భూములు, వంకలు, చెరువులను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే మదనపల్లె పట్టణ నడిబొడ్డున ఉన్న కురవంక, కోమిటివానిచెరువు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణప్ప, సాంబశివ, మురళి, దేవ, తిరుమలప్ప, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-20T05:55:52+05:30 IST