ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటినుంచి సచివాలయాలకు రాం రాం..!

ABN, First Publish Date - 2021-12-03T07:36:47+05:30

వీఆర్వోలు సచివాలయాలకు వస్తే తరమాలంటూ మంత్రి అప్పలరాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గురువారం జిల్లావ్యాప్తంగా వీఆర్వోలు అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలతో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

చిత్తూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న వీఆర్వోలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మంత్రి క్షమాపణ చెప్పకుంటే దశలవారీగా ఉద్యమాలు

 వీఆర్వో సంఘ నేతల అల్టిమేటం


చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 2: వీఆర్వోలు సచివాలయాలకు వస్తే తరమాలంటూ మంత్రి అప్పలరాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గురువారం జిల్లావ్యాప్తంగా వీఆర్వోలు అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలతో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. మంత్రి క్షమాపణ చెప్పకుంటే దశలవారీగా ఉద్యమాలకు దిగుతామని అల్టిమేటం జారీ చేశారు. ఈ సందర్భంగా వీఆర్వోల సంఘ జిల్లా అధ్యక్షుడు కె.బాలాజీ రెడ్డి, చిత్తూరు డివిజన్‌ ప్రెసిడెంట్‌ మార్కొండయ్య, తిరుపతి డివిజన్‌ జనరల్‌ సెక్రటరీ చెంగల్రాయులు తదితరులు మీడియాతో మాట్లాడారు. శుక్రవారం నుంచి సచివాలయాలకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి మాత్రమే విధులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మంత్రిని బర్తరఫ్‌ చేసి.. సీఎం తమకు రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తేనే సచివాలయాలకు వెళ్తామని చెప్పారు.

Updated Date - 2021-12-03T07:36:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising