కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వాలి: టీడీపీ
ABN, First Publish Date - 2021-10-29T05:47:51+05:30
పేదల కు కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వా లని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అఖిలపక్ష నాయకులు చెప్పారు. బి.కొత్తకోట పట్టణంలో రెం డురోజుల కిత్రం నగర పంచాయతీ అధికారులు కూల్చివేసిన ఇళ్లను టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మౌలానాఅహ్మద్, రాష్ట్ర కార్యనిర్వా హక కార్యదర్శి పర్వీన్తాజ్తో కలిసి పరిశీలించారు.
బి.కొత్తకోట, అక్టోబరు 28: పేదల కు కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వా లని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అఖిలపక్ష నాయకులు చెప్పారు. పట్టణంలో రెం డురోజుల కిత్రం నగర పంచాయతీ అధికారులు కూల్చివేసిన ఇళ్లను టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మౌలానాఅహ్మద్, రాష్ట్ర కార్యనిర్వా హక కార్యదర్శి పర్వీన్తాజ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ... తాము ఎన్నోఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని, వైసీపీ నాయకుల ప్రోద్బలంతో అధికారులు ఇళ్లను కూల్చివేశారని వాపోయారు. సీపీఐ నాయకుడు మనోహర్రెడ్డి, బీజేపీ నాయకుడు రవీంద్ర, టీడీపీ నాయకులు మహమ్మద్ రఫి, చావిడి కిట్టన్న, శిల్ప ఆంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-29T05:47:51+05:30 IST