ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతిలో బీభత్సం సృష్టించిన భారీ వర్షం

ABN, First Publish Date - 2021-11-12T20:01:53+05:30

తిరుపతి: నగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: నగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతతోపాటు బలంగా వీచిన ఈదురుగాలుల ధాటికి జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఇస్కాన్ రోడ్డులోని ఫారెస్టు కార్యాలయం, రుయా, ప్రసూతి, చిన్నపిల్లల ఆస్పత్రి ఆవరణల్లో చెట్ల కొమ్మలు విరిగిపడడంతో కార్లు, ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. మధురానగర్, లక్ష్మీపురం, పద్మావతి పురం, కట్టకింద ఊరు ప్రాంతాల్లో మురికినీటితో కలిసిన వర్షపునీరు ఇళ్లల్లోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులుపడుతున్నారు.


రుయా ఆస్పత్రిలోని ప్రధాన భవనంపై నుంచి నీరు లోపలికి చేరడంతో కొన్నివార్డులు, కార్యాలయ గదులు వర్షపునీటితో నిండిపోయాయి. దీంతో రోగులను వేరే వార్డులకు తరలించారు. తిరుచానూరులోని షికారి కాలనీ వాసులను అధికారులు పునరావాస కేంద్రలకు తరలించారు. చెర్లోపల్లి అండర్ బ్రిడ్జిలో రెండు ఆర్టీసీ బస్సులు నీటిలో చిక్కుకున్నాయి. స్థానిక పోలీసుల సహయాంతో ప్రయాణీకులు బయటకు రాగలిగారు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మేయర్ శిరీష, కమిషనర్ గిరీష పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - 2021-11-12T20:01:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising