కిటకిటలాడిన బోయకొండ
ABN, First Publish Date - 2021-10-18T06:03:40+05:30
ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది.
చౌడేపల్లె, అక్టోబరు 17: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. కాగా, ఉదయం ఆలయంలో అర్చకులు ఆలయ శుద్ధి జరిపి అమ్మవారికి ప్రీతికరమైన వేపాకుల తోరణంతో అలంకరించారు. అనంతరం గంగమ్మను స్వర్ణాభరణాలు, పూలతో అలంకరించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఆలయ చైర్మన్ మిద్దింటి శంకర నారాయణ, ఈవో చంద్రమౌళి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Updated Date - 2021-10-18T06:03:40+05:30 IST