ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్లు చెల్లించకుండా వేధిస్తున్నారు!

ABN, First Publish Date - 2021-12-01T06:09:10+05:30

బిల్లు చెల్లించకుండా అధికారులు వేధిస్తున్నారంటూ ఐరాల మండలం తాళంబేడువారిపల్లెకు చెందిన కాంట్రాక్టర్‌ గోవిందస్వామి వాపోయారు.

ధర్నా చేస్తున్న గోవిందస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీఆర్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్‌ ధర్నా


చిత్తూరు సిటీ, నవంబరు 30: బిల్లు చెల్లించకుండా అధికారులు వేధిస్తున్నారంటూ ఐరాల మండలం తాళంబేడువారిపల్లెకు చెందిన కాంట్రాక్టర్‌ గోవిందస్వామి వాపోయారు. ఈ మేరకు మంగళవారం చిత్తూరు డివిజన్‌ పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో తాళంబేడువారిపల్లెలో అంగన్‌వాడీ భవనాన్ని నిర్మించి అధికారులకు తాళాలు ఇచ్చానని చెప్పారు. దీనికి సంబంధించి రూ.3.83 లక్షల బిల్లు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం మారడంతో రెండున్నరేళ్లుగా బిల్లుకోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అప్పు చేసి పనులు పూర్తిచేశానని, వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నానన్నారు. అధికారులు బిల్లు చెల్లించకుంటే కుటుంబసమేతంగా కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరగా.. త్వరలోనే బిల్లు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Updated Date - 2021-12-01T06:09:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising