ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిండు సభలో భువనేశ్వరిని అవమానించడం బాధాకరం.. YSRCP కి గుడ్ బై..

ABN, First Publish Date - 2021-11-21T16:44:59+05:30

తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమార్తె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వైసీపీని వీడిన మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ 
  • మహిళలను గౌరవించలేని పార్టీలో కొనసాగలేనని స్పష్టీకరణ

చిత్తూరు జిల్లా/తంబళ్లపల్లె : తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు సతీమణి నారా భువ నేశ్వరిని నిండు సభలో వైసీపీ నేతలు అవమానించడం సిగ్గుచేటని మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ విమర్శించారు. మహిళలను గౌరవించలేని వైసీపీ తీరు నచ్చక ఆ పార్టీని వీడుతున్నట్లు శనివారం ఆమె మీడియాకు తెలిపారు.


గత ఎన్నికల్లో తాను, తన భర్త రెడ్డెప్ప వైసీపీ విజయానికి కృషి చేశామని అయితే, అధికార పార్టీలో ప్రజాస్వామ్యం అభాసుపాలవుతుండటం చూసి  జీర్ణించుకోలేక తాము వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక  ఏ రాజకీయ పార్టీలో కొనసాగేది లేదని.. వ్యవసాయం చేసుకుంటామని తెలిపారు. కాగా, నాగరత్నమ్మ 1998-99లో టీడీపీ తంబళ్లపల్లె ఎంపీపీగా పనిచేశారు. అనంతరం నాగరత్నమ్మ దంపతులు మూడేళ్ల కిందట ఎంపీ మిథున్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.

Updated Date - 2021-11-21T16:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising