కరోనా బారి నుంచి బయట పడాలి
ABN, First Publish Date - 2021-01-24T06:10:49+05:30
కరోనా బారిన నుంచి అందరం బయటపడాలని, కొవిడ్ వ్యాక్సిన్ సురక్షితమైందని ధైర్యంగా వేయించుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళ్సైసౌందరరాజన్ పేర్కొన్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళసై
ఐరాల(కాణిపాకం), జనవరి 23: కరోనా బారిన నుంచి అందరం బయటపడాలని, కొవిడ్ వ్యాక్సిన్ సురక్షితమైందని ధైర్యంగా వేయించుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళ్సైసౌందరరాజన్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆమె కుటుంబ సమేతంగా వరసిద్ధుడి దర్శనానికి వచ్చారు. ఆమెను పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మె్సబాబు, ఈవో వెంకటేశు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తమిళసై మాట్లాడుతూ కాణిపాక క్షేత్రం సత్యప్రమాణాలకు నెలవైన కోవెల అన్నారు. స్వామి వారు బావిలో కొలువై ఉండటం చాలా అద్భుతమన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రేణుక, ఎస్పీ సెంథిల్కుమార్, డీఎస్పీ సుధాకర్రెడ్డి, నాయకులు జగన్నాథరెడ్డి, ప్రభాకర్రెడ్డి,కుమారరాజ, శాంతిసాగర్రెడ్డి, రవిచంద్రారెడ్డి, ఏఈవో విద్యాసాగర్రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, ఆలయ ఇన్స్పెక్టర్ కిషోర్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-24T06:10:49+05:30 IST