ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులు సేవాతత్వం పెంచుకోవాలి: సీఎండీ

ABN, First Publish Date - 2021-06-22T06:57:43+05:30

ఉద్యోగులు తమ విధులతో పాటు సామాజిక సేవలు అందించడాన్నీ అలవరచుకోవాలని సదరన్‌ డిస్కం సీఎండీ హెచ్‌.హరనాథరావు సూచించారు.

సేవ చేసిన ఉద్యోగులకు నగదు, బియ్యం అందజేస్తున్న హరనాథరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(ఆటోనగర్‌), జూన్‌ 21: ఉద్యోగులు తమ విధులతో పాటు సామాజిక సేవలు అందించడాన్నీ అలవరచుకోవాలని సదరన్‌ డిస్కం సీఎండీ హెచ్‌.హరనాథరావు సూచించారు. తిరుపతిలో 26 రోజులుగా సామాజిక సేవలు అందించిన ఉద్యోగులను సోమవారం ఆయన విద్యుత్‌ సర్కిల్‌ కార్యాలయ ప్రాంగణంలో అభినందించారు. ఈ సేవలు చేసిన ఉద్యోగులకు ఆయన నగదు, బియ్యం అందించి మాట్లాడారు. తిరుపతి స్మార్టుసిటీ పరిధిలోని ఆస్పత్రుల వద్ద 26 రోజులుగా 13వేల మంది కరోనా బాధితుల సహాయకులకు, నిరాశ్రయులకు ఆహార పొట్లాలు, నీళ్ల బాటిళ్లు అందించడం అభినందనీయమన్నారు. దీనికి ఆర్థిక సహాయం అందించిన ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ  డి.వెంకటాచలపతి, ఈఈ వాసుదేవరెడ్డి,(తిరుపతి రూరల్‌), డీవైఈఈ బాబు, విష్ణువర్ధన్‌ (సివిల్‌), ఎస్‌ఏవో మురళీకుమార్‌, 1104 ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిస్కం నేత దేవేంద్రరెడ్డి, ఏఏవో శివశంకర్‌, చందు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T06:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising