ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట పొలాలపై కొనసాగుతున్న గజదాడులు

ABN, First Publish Date - 2021-07-09T04:57:08+05:30

వి.కోట మండల అటవీ సరిహద్దు గ్రామాల్లో గజదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వారం రోజులుగా ఏనుగులు మూడు గుంపులుగా విడిపోయి పంటపొలాలపై దాడులు చేస్తున్నాయి.

కైగల్‌ అడవిలో సంచరిస్తున్న ఏనుగు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వి.కోట, జూలై 8: వి.కోట మండల అటవీ సరిహద్దు గ్రామాల్లో గజదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వారం రోజులుగా ఏనుగులు మూడు గుంపులుగా విడిపోయి పంటపొలాలపై దాడులు చేస్తున్నాయి. తాజాగా 14 ఏనుగులు కైగల్‌ అటవీ ప్రాంతం నుంచి శ్రీకార్లపల్లె, కుమ్మరమడుగు, నాగిరెడ్డిపల్లె, వెంకటేపల్లె, దండికుప్పం ప్రాంతాల్లో  పొలాల్లోకి చొరబడి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. బుధవారం రాత్రి కుమ్మరమడుగు పరిసరాల్లో వంకాయ, టమోటా, బీన్స్‌, చిక్కెడు, మామిడి తోటల్లో పంటలను తిని తొక్కి నాశనం చేశాయి. శ్రీకార్లపల్లె పరిసరాల్లో అరటి, మామిడి, టమోటా తోటను నష్టపరిచింది. ట్రాకర్స్‌ సాయంతో ఏనుగులను కర్ణాటక వైపు దారి మళ్ళించారు. అయితే అక్కడి అటవీశాఖ వారు వాటిని దారి మళ్ళించడంతో అవి తిరిగి వి.కోట వైపు మళ్ళాయి. కస్తూరినగరం నర్సరీ వద్ద జాతీయ రహదారిని దాటి దండికుప్పం అటవీ ప్రాంతంలోనికి ప్రవేశించాయి. మరో వైపు పంట నష్టాన్ని అటవీ అధికారులు పరిశీలించి అంచనాలను సిద్దం చేస్తున్నారు. 

Updated Date - 2021-07-09T04:57:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising