ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16న ఒక జడ్పీటీసీ, ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక

ABN, First Publish Date - 2021-11-14T06:00:31+05:30

జిల్లాలో ఒక జడ్పీటీసీ, ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 16న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆర్వో మురళి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, నవబరు 13: జిల్లాలో ఒక జడ్పీటీసీ, ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 16న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆర్వో మురళి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం 93 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో 44 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. బంగారుపాళ్యం జడ్పీటీసీ ఎన్నిక కోసమే 67 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 117 మంది పీవోలు, 117 మంది ఏపీవోలు, 351 మంది పీవోలను నియమించినట్లు చెప్పారు. ఎన్నికల కోసం 15 రూట్లను గుర్తించినట్లు చెప్పారు. అలాగే 18న జరిగే ఓట్ల లెక్కింపు కోసం 32 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్వో వివరించారు. ఇందుకోసం 37మంది కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, 78 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చామన్నారు. బంగారుపాళ్యం జడ్పీటీసీ స్థానానికి అక్కడి స్థానానికి జడ్పీ హైస్కూల్‌లో కౌంటింగ్‌ కేంద్రంగా గుర్తించామని ఆర్వో చెప్పారు. 

Updated Date - 2021-11-14T06:00:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising