ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘటనపై డీఎస్పీ విచారణ

ABN, First Publish Date - 2021-08-02T05:28:03+05:30

ఆస్తి కోసం జరిగిన ఘర్షణలో వృద్ధురాలి మృతి చెందడంపై డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నారాయణమ్మ కుటుంబీకులను విచారిస్తున్న డీఎస్పీ రవిమనోహరాచారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హత్య, అట్రాసిటీ కేసు నమోదు

మదనపల్లె క్రైం, ఆగస్టు 1: ఆస్తి కోసం జరిగిన ఘర్షణలో వృద్ధురాలి మృతి చెందడంపై డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా.. .కొత్తకోట మండలం బయప్పగారిపల్లెకు చెందిన నారాయణమ్మ(70) శనివారం గ్రామంలో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు. డీఎస్పీ రవి మనోహరాచారి, రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌ ఆదివారం ఆస్పత్రికి చేరుకుని ఘటనపై బాధిత కుటుంబీకులను విచా రించారు. కాగా నారాయణమ్మ కుటుంబ సభ్యులు, గ్రామానికి చెందిన అశోక్‌, ప్రసాద్‌ నెలరోజుల కిందట ఆస్తి విషయమై గొడవపడ్డారు. శని వారం జరిగిన ఇరువర్గాల ఘర్షణలో నారాయణమ్మ తీవ్రంగా గాయపడగా కుటుంబీకులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వృద్ధురాలి మృతికి కారకు లైన వారిపై హత్య, అట్రాసిటీ కేసు నమోదు చేస్తున్నామన్నారు. అదే విధంగా మరిన్ని కోణాల్లో కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రామ్మోహన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-08-02T05:28:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising