జిల్లాస్థాయి గ్రాప్లింగ్ పోటీల ప్రారంభం
ABN, First Publish Date - 2021-12-15T06:43:58+05:30
శ్రీకాళహస్తి పట్టణ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లాస్థాయి గ్రాప్లింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి.
క్రీడాకారులతో డీఎస్పీ విశ్వనాథ్ తదితరులు
శ్రీకాళహస్తి, డిసెంబరు 14: పట్టణ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లాస్థాయి గ్రాప్లింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. డీఎస్పీ విశ్వనాథ్, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి కుమారుడు ఆకర్ష్రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందనీ, అందరూ బాగా రాణించాలని ప్రముఖులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నేత మిద్దెల హరి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-15T06:43:58+05:30 IST