ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు అడవిలో జంట మృతదేహాలు

ABN, First Publish Date - 2021-08-02T06:28:25+05:30

రామచంద్రాపురం మండలం చిటత్తూరు అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి జంట మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

సంఘటనా స్థలంలో పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుత్తణివాసులుగా గుర్తింపు


రామచంద్రాపురం, ఆగస్టు 1: రామచంద్రాపురం మండలం చిటత్తూరు అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి జంట మృతదేహాలను పోలీసులు గుర్తించారు. తిరుత్తణికి చెందిన సంజీవరెడ్డి(70), మాల(60) గత నెల 29వ తేదీన తప్పిపోయినట్టు అక్కడి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో అనుమానితుడిని వారు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నేరాన్ని అంగీకరించడంతోపాటు చిటత్తూరు అడవిలో హత్యా స్థలాన్ని తిరుత్తణి పోలీసులకు చూపించాడు. ఈ సమాచారాన్ని ఆర్సీపురం పోలీసులకు తిరుత్తణి పోలీసులు తెలియజేశారు. దాంతో రేణిగుంట సీఐ అమరనాథరెడ్డి, ఆర్సీపురం ఎస్‌ఐ ఎర్రిస్వామి తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు మృతదేహాలు కుళ్లిపోవడంతో పోస్టుమార్టం చేసేందుకు వీలుకాలేదు. రెవెన్యూ, వైద్యసిబ్బంది ఆదివారం అందుబాటులో లేకపోవడంతో సోమవారం సంఘటనా స్థలంలోనే శవపంచనామా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న పరిసర గ్రామప్రజలు, మీడియా ప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పోలీసులు అందరినీ వెనక్కి పంపేశారు. హత్యకు సంబంధించిన కారణాలు వెల్లడించేందుకు తిరుత్తణి, ఆర్సీపురం పోలీసులు నిరాకరించారు. నిందితుడిని తిరుత్తణి పోలీసులు తీసుకుని కారులో వెనక్కి తీసుకెళ్లారు. ఆర్సీపురం ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు మృతదేహాల వద్ద కాపలా కాస్తున్నారు. 

Updated Date - 2021-08-02T06:28:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising