ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు ఢీకొని కరోనా బాధితురాలి మృతి

ABN, First Publish Date - 2021-05-18T06:51:39+05:30

చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ వద్ద ఓకారు అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న కొవిడ్‌ బాధితురాలు మునెమ్మ(60)ను ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

మృతి చెందిన మునెమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొండవాడ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ వద్ద ప్రమాదం 


చంద్రగిరి, మే 17: చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ వద్ద ఓకారు అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న కొవిడ్‌ బాధితురాలు మునెమ్మ(60)ను ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు.. అరిగిలవారిపల్లెకు చెందిన మునెమ్మకు, ఆమె కోడలుకు కరోనా పాజిటివ్‌ రావడంతో తొండవాడ సమీపంలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు వచ్చారు. మునెమ్మకు ఆక్సిజన్‌ శాచురేషన్‌ తక్కువగా ఉండటంతో డాక్టర్లు తిరుపతికి సిఫార్సు చేశారు. దీంతో మునెమ్మ, ఆమె కోడలు తిరుపతికి వెళ్లడానికి రోడ్డు పక్కన ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్ళుతున్న కారు అదుపు తప్పి మునెమ్మపైకి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందింది. కొంత తర్జన భర్జనపడిన తర్వాత పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-18T06:51:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising