ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేరుశనగ రైతులకు నష్టపరిహారం అందించాలి

ABN, First Publish Date - 2021-10-27T05:36:15+05:30

ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రాటకొండ మధుబాబు డిమాండ్‌ చేశారు. మంగళవారం మదనపల్లె మండలం టేకులపాళెంలో మధుబాబు పర్యటించారు.

టేకులపాళెంలో వేరుశనగ పంట సాగు చేసిన రైతులతో తెలుగు రైతు కమిటి రాష్ట్ర కార్యదర్శి మధుబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి మధుబాబు


మదనపల్లె టౌన్‌, అక్టోబరు 26: ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రాటకొండ మధుబాబు డిమాండ్‌ చేశారు. మంగళవారం మదనపల్లె మండలం టేకులపాళెంలో మధుబాబు పర్యటించారు. ఈ సందర్భంగా వేరుశనగ సాగు చేసిన రైతులతో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసిన రైతులకు ఎకరాకు రూ.20వేలకు పైగా పెట్టుబడి ఖర్చు వచ్చిందన్నారు. కాని అదునులో వర్షం పడకపోవడంతో పంట దిగుబడి 30శాతం కూడా రాలేదన్నారు. దీని వలన జిల్లాలో 1.20లక్షల హెక్టార్లకు పైగా వేరుశనగ సాగు చేసిన రైతులందరికీ ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. రైతు భరోసా, యాంత్రీకరణ పథకాలంటూ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కే సీఎం జగన్‌... చిత్తూరు, అనంతపురం జిల్లాలో లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. టీడీపీ నాయకులు వంటికొండ వెంకటేష్‌, శ్రీరామ వినోద్‌కుమార్‌, నాగయ్య, పూల మురళి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T05:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising